దేశంలో పదిహేనేళ్ల తర్వాత చేపట్టబోతున్న కులగణన(Census).. జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ముందుగానే మొదలవుతుంది. 2026 అక్టోబరు 1న ఈ నాలుగు శీతల(Snow Bound) రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది. ఇక మైదాన ప్రాంతాలైన మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి లెక్కింపు మొదలు కానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. చివరిసారి 2011లో కులగణన జరగ్గా, కొవిడ్ వల్ల 2021లో వాయిదా పడింది. డిజిటల్ రూపంలో ట్యాబ్ ల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేస్తారు. ఈ డేటా భద్రత కోసం కేంద్ర హోంశాఖ దృష్టిపెట్టింది. రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు ఈ గణన ఆధారం కానుంది.