హైవే ప్రయాణాన్ని మరింత సులభం చేస్తున్న కేంద్రం.. టోల్ ఫీజుల వ్యవస్థలో భారీ మార్పులు తెచ్చింది. ఇక టూవీలర్లకు కూడా ఫీజు వసూలు చేస్తారు అంటూ జరుగుతున్న ప్రచారంపై జాతీయ రహదారుల సంస్థ(NHAI) స్పందించింది. ఫాస్టాగ్(Fastag) ద్వారా డిజిటల్ టోల్ వ్యవస్థలోకి ద్విచక్ర వాహనాల్ని(Two Wheelers) తీసుకువచ్చే ఆలోచన లేదని తెలిపింది. అయితే ఇప్పటికే వాణిజ్యేతర వాహనాలు రూ.3 వేలు చెల్లిస్తే 200 ట్రిప్పులు లేదా, ఏడాది గడువు లోపు టోల్ గేట్లు దాటేలా అవకాశమిచ్చింది. ఇదే విధానాన్ని ద్విచక్రవాహనాలకు కూడా అమలు చేస్తారంటూ ప్రచారం మొదలవగా దాన్ని ఖండిస్తూ NHAI ట్వీట్ చేసింది. అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపడేసింది. https://justpostnews.com
ద్రం