19 వాహనాల కాన్వాయ్ తో ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సడెన్ గా బ్రేక్ డౌన్ వెహికిల్ కదల్లేదు. ఏంటా అని చూస్తే డీజిల్ కల్తీ అని తేలింది. మధ్యప్రదేశ్ CM మోహన్ యాదవ్(Mohan Yadav) ఇండోర్ నుంచి వెళ్తుండగా రాట్లమ్(Ratlam) వద్ద బంకులో డీజిల్ నింపుకున్నారు. అక్కణ్నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే బండ్లు ఆగిపోయాయి. కిలోమీటర్ లోపు కొన్ని ఆ తర్వాత మరికొన్ని కదల్లేదు. కొద్దిసేపు తోసినా లాభం లేకపోవడంతో వేరే కాన్వాయ్ ను తెప్పించారు. డీజిల్ లో నీళ్లు కలిపినట్లు సివిల్ సప్లయిస్ అధికారులు చేపట్టిన టెస్టులో తేలింది. దీంతో ఆ బంకును సీజ్ చేసి.. సీఎంను విమానం ద్వారా పంపించారు.