పాకిస్థాన్ సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లో విద్యాలయాలు మూతపడ్డాయి. జమ్మూ, రాజౌరీ, పూంఛ్, సాంబా, కథువా(Kathua).. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, అమృత్ సర్.. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఆంక్షలు అమలవుతున్నాయి. పరీక్షల్ని కశ్మీర్ యూనివర్సిటీ వాయిదా వేసింది.