పోలింగ్ బూత్ ల ఫుటేజ్ ను 45 రోజులకు పైగా ఉంచాలన్న డిమాండ్లను ఎన్నికల సంఘం(EC) తిరస్కరించింది. ఇది సరైందేనని అనిపించినా.. ఓటర్ల గోప్యత(Privacy), భద్రతకు ప్రమాదమని స్పష్టం చేసింది. సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో EC క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సమూహం, లేదా వ్యక్తిగత ఓటర్లను సులభంగా గుర్తించే ఫుటేజ్ ను భద్రపరచడం, బయటకు ఇవ్వడం.. ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలిపింది. ఓటు వేసినవారు, వేయనివారు బెదిరింపులకు గురవుతారని.. 1950, 51 ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని తేల్చింది. ఏదైనా పార్టీకి ఒక బూత్ లో తక్కువ సంఖ్యలో ఓట్లు వస్తే.. ఎవరు ఓటేశారు, ఎవరు వేయలేదో CCTV ఫుటేజ్ ద్వారా సులభంగా గుర్తించి వేధించడం, బెదిరించడం జరుగుతాయని EC తెలిపింది. ఈ వార్త పూర్తిగా కావాలంటే క్లిక్ చేయండి… https://justpostnews.com/national/ec-on-electronic-footage-in-polling-booths/