2024-25లో 3.4 మెట్రిక్ టన్నుల(3,400 కిలోల) బంగారం పట్టుబడగా, కేంద్ర ప్రభుత్వానికి RBI అప్పగించింది. దేశవ్యాప్తంగా పట్టుబడ్డ పుత్తడిని సెక్యూరిటీ ప్రింటింగ్&మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) ఆధ్వర్యంలో కేంద్రానికి అందజేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)తోపాటు కస్టమ్స్ విభాగం సోదాలు చేస్తుంటుంది. అంతకుముందు ఏడాది 2023-24లో 4,869 కిలోల బంగారం దొరికింది. సరిహద్దు దేశాలు గల రాష్ట్రాలు, విమానాశ్రయాల ద్వారా భారీగా అక్రమ రవాణా జరుగుతుంటుంది.