భారత భాషా వారసత్వాన్ని(Tradition) తిరిగి పొందాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మాతృభాషలతోనే ప్రపంచాన్ని నడిపించే టైం వచ్చిందని, ఇంగ్లిష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. మాజీ IAS అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయ్ బూంద్ స్వయం-ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణలో షా మాట్లాడారు. దేశ భాషలు మన సాంస్కృతిక వారసత్వాలని, అవి లేకుండా భారతీయులుగా ఉండటం సాధ్యం కాదన్నారు. సగం కాల్చిన విదేశీ భాషల ద్వారా సంపూర్ణ భారతాన్ని ఊహించలేమన్నారు. మన సంస్కృతి, సాహిత్యం, మతాన్ని తాకడానికి ప్రయత్నించినప్పుడల్లా భారత సమాజం వాటిని ఓడించిందన్నారు.