ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ బదిలీ చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ వర్మ గతంలో అలహాబాద్ లోనే పనిచేయగా, 2021లో ఢిల్లీ వచ్చారు. బదిలీతో న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదని, ఆయన్ను తొలగించాలంటూ కొలీజియం సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఎలా తొలగిస్తారంటే…
సుప్రీం, హైకోర్టు జడ్జిల్ని తొలగించడం(అభిశంసన) పెద్ద ప్రక్రియే. అవినీతి, తప్పులు, అక్రమాలకు పాల్పడే జడ్జిలపై సుప్రీం గైడ్ లైన్స్-1999 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుపై తొలుత సదరు జడ్జిని వివరణ అడుగుతారు. దానిపై సందేహముంటే అంతర్గత విచారణకు ఆదేశిస్తారు. సుప్రీం జడ్జి ఒకరు, ఇద్దరు హైకోర్టు జడ్జిలు కమిటీలో ఉంటారు. వీరిచ్చే రిపోర్ట్ ఆధారంగా కళంక న్యాయమూర్తిని రాజీనామా చేయాలని తొలుత CJI చెబుతారు. రాజీనామాకు నిరాకరిస్తే అతణ్ని తొలగించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తారు. ఆర్టికల్ 124(4), 124(5) ప్రకారం పార్లమెంటు ద్వారా కళంకిత న్యాయమూర్తిని అభిశంసన చేశాక రాష్ట్రపతి ఉత్తర్వులిస్తారు.
చరిత్రలో ఇవే…
@ అభిశంసన ఉత్తర్వులు దాఖలైన తొలి జడ్జిగా జస్టిస్ వి.రామస్వామి నిలిచారు. ఆయన్ను తొలగించేందుకు 1993లో లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. 2/3 మెజార్టీ సాధించలేకపోవడంతో అభిశంసన అమలు కాలేదు.
@ 2011లో రాజ్యసభ మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్రా సేన్ అభిశంసన జరిగింది. దేశంలో ఈ తరహా చర్యలకు గురైన తొలి న్యాయమూర్తిగా నిలిచిపోయారు.
@ అవినీతి, భూకబ్జా, విధుల దుర్వినియోగంపై సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.డి.దినకరన్ పై జ్యుడీషియల్ ప్యానెల్ ఏర్పాటైంది. ఆరోపణల్ని పరిశీలించేందుకు రాజ్యసభ ఛైర్మనే ప్యానెల్ వేశారు. కానీ తనపై అభిశంసన ప్రక్రియ మొదలు కాకముందే 2011లో దినకరన్ రాజీనామా చేశారు.
1 thought on “సుప్రీం, హైకోర్టు జడ్జిల్ని ఎలా తొలగిస్తారంటే… How Can Removed”