ఆపరేషన్ సిందూర్ లో వైమానిక దళం(Air Force) పనితీరు చూశాం. కానీ నేవీకి పైనుంచి ఆదేశాలు వస్తే ఏం జరిగేదో తెలుసా.. శత్రువుకు నూకలు చెల్లేవి. ఆ దేశం లోపల భూమిపై దాడి చేసే క్షిపణుల్ని(Missiles) హాట్-స్టాండ్ బైలో ఉంచారు. పాక్ జలాంతర్గాములు, నౌకలు అసలు టార్గెట్. కరాచీ పోర్టు కోసం బ్రహ్మోస్ క్షిపణులు, జలాంతర్గామిపై లాండ్-అటాక్ క్రూయిజ్ మిసైల్స్ రెడీ చేశారు. ఇరుదేశాల ఉద్రిక్తతలతో పాక్ ఆస్తులు, వాణిజ్యమంతా పోర్టులోనే ఉంది. భారత్ దాడికి దిగితే అవన్నీ నౌకలతోనే నీటిలో మునిగేవి. ప్రత్యర్థి దక్షిణ తీరం కోసం ఉత్తర అరేబియా సముద్రంలో INS విక్రాంత్ ను మిగ్-29k ఫైటర్ జెట్లతో నింపారు.https://justpostnews.com
ఆ దేశ RAS-72 విమానంపై INS డేగ కన్ను పెట్టింది. మిగ్-29k ఫైటర్లు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉండటం చూసి పాక్ ఫ్లైట్ తోకముడిచింది. అక్కడి 100 మీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో భారత నేవీ మిగ్ లు సమాచారమిస్తున్నాయి. కేవలం కరాచీ పోర్టే కాదు అక్కడి వైమానిక స్థావరాలన్నింటినీ భస్మీపటలం చేసేలా ప్లాన్ సిద్ధమైంది. కరాచీ పోర్టు ధ్వంసమైతే పాక్ జీవనాడి దెబ్బతిన్నట్లే.