అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో కళ్లు చెదిరే దృశ్యాలు రికార్డయ్యాయి. మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం కూలి(Crash) మెడికల్ కాలేజీపై పడింది. ఆ సమయంలో విద్యార్థులు, స్టాఫ్(Staff) అంతా పై ఫ్లోర్లో భోజనం చేస్తున్నారు. ఫ్లైట్ విరిగిపడటంతో పారిపోయేందుకు బాల్కనీ నుంచి దూకారు. బాల్కనీ తప్ప వాళ్లకు వేరే మార్గమే లేకుండా పోయింది. అయినా ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.