అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం… చూస్తుండగానే కుప్పకూలి మెడికల్ కాలేజీపై పడింది. మంటలతో భవనంపై పడటంతో అందులోని ఐదుగురు మెడికోలు ప్రాణాలు వదిలారు. 242 మందిలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన ఎయిరిండియా ఫ్లైట్ లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడియన్ ఉన్నారు.