గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కుప్పకూలింది. విమానాశ్రయం సమీపంలోని మేఘని ప్రాంతంలో టేకాఫ్ అయిన వెంటనే ఘటన జరగ్గా.. భారీగా పొగలు వచ్చాయి. అది ప్యాసింజరా, కార్గో విమానమా అన్నది తేలాలి. ప్యాసింజర్ విమానమైతే అందులో 200 మంది దాకా ఉండే అవకాశముంది. వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారా, లేదా అన్న వివరాల్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ధ్రువీకరించాల్సి ఉంది. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.