నాలుగు రోజుల క్రితం ఎయిరిండియా(Air India) విమానం కూలి 275 మంది చనిపోగా, 3 రోజుల్లో మరిన్ని ఫ్లైట్లలో సమస్యలు వచ్చాయి. నిన్న 360 మందితో లండన్ హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై బయల్దేరిన బోయింగ్ 787-8 ఫ్లైట్.. అరగంట ప్రయాణించాక తిరిగి హీత్రూలోనే దిగింది. 12 వేల అడుగుల ఎత్తులో సాంకేతిక సమస్య గుర్తించారు. ఈరోజు సైతం హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న బోయింగ్-787.. గాల్లో ఉండగానే ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. ఈ విషయాన్ని పైలెట్లు ATC(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి సమాచారమివ్వడంతో ఆ విమానాన్ని తిరిగి హాంకాంగ్ లోనే దించారు.