భారత గూఢచారి సంస్థ(RAW)కు అధిపతిగా సీనియర్ IPS పరాగ్ జైన్ నియమితులయ్యారు. 2025 జూన్ 30తో ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం పూర్తవుతుంది. 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ కు చెందిన పరాగ్ ను ‘రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)’ చీఫ్ గా మోదీ సర్కారు నియమించింది. రెండేళ్లపాటు బాధ్యతల్లో ఉంటారు. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ బాధ్యతలు చూస్తున్న పరాగ్.. ఆపరేషన్ సిందూర్ లో పాక్ పై గురిపెట్టి నిఘా సమాచారం సేకరించింది ఆయనే. కశ్మీర్, ఉత్తరాఖండ్ సహా వివిధ రాష్ట్రాలతోపాటు కెనడా, శ్రీలంకల్లో పనిచేసిన ఆయనకు.. కౌంటర్ టెర్రరిజంపై పట్టుంది.