అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కూలిన తర్వాత ఎయిరిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆ సంస్థ యాజమాన్యమైన టాటా గ్రూప్.. కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే మృతుల్లో ఒక్కొక్కరికి రూ.1.25 కోట్లు అందించిన టాటా.. న్యాయప్రక్రియ ద్వారా పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. టాటాయేతర సభ్యులే ఇందులో మెంబర్లుగా ఉంటారు. 26/11 ముంబయి దాడుల తర్వాత ఆ బాధితులకు తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ద్వారా సాయమందుతోంది. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో బాంబు దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.