భారతీయ జనతా పార్టీ MLA రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ఆ లెటర్ ను అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ‘ప్రెసిడెంట్ గా రాంచందర్ రావును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది నాకే కాదు, లక్షలాది కార్యకర్తలకు నిరాశ కలిగించింది. కార్యకర్తలు, నాయకులు, ఓటర్ల ఆవేదనను చూసే ఈ భారమైన నిర్ణయం తీసుకున్నా. తొలిసారి రాష్ట్రంలో BJP అధికారంలోకి రావడంలో అనుమానాలు వచ్చేలా చేశారు..’ అంటూ ఆవేదన
చెందారు.