రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు KCR కుటుంబమేనని, తాను ఉన్నంత వరకు ఆయన కుటుంబానికి కాంగ్రెస్ లో ఎంట్రీ లేదని రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన.. మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రివర్గ శాఖల కేటాయింపుపై హైకమాండ్ తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపైనా స్పందించారు. శాఖల కేటాయింపు, మార్పుచేర్పుల అంశాల్ని ప్రస్తావించలేదన్న CM.. కేవలం కర్ణాటక కులగణనపైనే అధిష్ఠానం పెద్దలతో మాట్లాడామన్నారు.