పాఠశాలలు(Schools), కళాశాలల(Colleges) వరకు డ్రగ్స్ చేరాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశాలపై దాడి చేసేందుకు కొందరు కరోనాను ఎంచుకుంటే మరికొందరు డ్రగ్స్ ను ప్రయోగిస్తారని తెలిపారు. దేశానికి సైనికుల్ని అందించడంలో పంజాబ్ టాప్ లో ఉంటుందని, కానీ మత్తుపదార్థాలే ఆ రాష్టాన్ని పాతాళానికి నెట్టాయన్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయికి అడ్డా కాదని అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా CM అన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యతని హెచ్చరించారు. చాక్లెట్ల పేరిట గంజాయి అమ్ముతున్న కిరాణా కొట్ల గురించి పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.