రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో మంతనాలు సాగుతున్నాయి. హైకమాండ్ పిలుపుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ తో CM రేవంత్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఉత్తమ్ కూడా హస్తిన చేరడంతో కీలక నేతలతో చర్చల తర్వాతే ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా ముగ్గురు మంత్రుల ప్రమాణస్వీకారంతో వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు వద్ద కీలకమైన రెండేసి శాఖలున్నాయి.