విమాన ప్రమాదంలో.. గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 242 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటపడగా, రూపానీ మృతిని BJP కన్ఫర్మ్ చేసింది. కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు ఆయన లండన్ బయల్దేరారు. 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1987లో రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేటర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం స్థాయికి చేరారు. ఆయనకు సతీమణి అంజలితోపాటు కుమారుడు ఉన్నారు. విమాన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకుని ప్రమాద కారణాలను గుర్తిస్తున్నారు.