నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాససనభ(Assembly) ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఐదింటికి గాను గుజరాత్ లో రెండు.. కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్లో ఒక్కో స్థానానికి ఈనెల 19న పోలింగ్ జరిగింది. గుజరాత్ విసావదార్ సీటును ఆమ్ ఆద్మీకి కోల్పోయిన BJP.. మరో స్థానమైన కాడి(Kadi)ని గెలుచుకుంది. కేరళ నీలంబూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ విజయం సాధించారు. పంజాబ్ లూథియానాలో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,076 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బెంగాల్లోని కాళీగంజ్ లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలీఫా అహ్మద్.. BJP క్యాండిడేట్ ఆశిష్ ఘోష్ పై 26,494 ఓట్ల లీడ్ లో నిలిచారు.