BRSను BJPలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే… ‘ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడతారా.. పార్టీలో కుట్రపూరితంగానే నన్ను MPగా ఓడించారు.. కాంగ్రెస్-BJPపై మాట్లాడాలి కానీ నాపై ప్రతాపమా.. నాకు నీతులు చెబుతూ కోవర్టులున్నారంటే ఎలా.. నేనిచ్చిన ఫీడ్ బ్యాక్ ఎలా లీకైంది.. నన్ను విమర్శిస్తున్న వారు KCRను అడ్డం పెట్టుకోవడం తప్ప చేసిందేముంది.. గంపగుత్తగా BRSను BJPకి అప్పగించాలన్నది కుట్ర.. పార్టీని పట్టించుకోకుండా ట్విట్టర్ లో ట్వీట్లు చేసి వదిలేస్తున్నారు.. దేశం బయట ఐటీ సెల్ లు నడిపిస్తున్నరు..’ అని విమర్శించారు. KTR, హరీశ్ రావు ఎక్కువగా ట్వీట్లు చేస్తుండటంతో వారినుద్దేశించే కవిత ఇలా మాట్లాడారా అన్న చర్చ మొదలైంది.