మంత్రి పదవి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశే ఎదురైంది. తాజాగా ముగ్గురు మంత్రుల్ని అధిష్ఠానం ప్రకటించడంతో ఆయన ఏం చేస్తారోనన్న ఉత్కంఠ పార్టీలో మొదలైంది. దీనిపై నల్గొండ జిల్లా మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పదవులు, అధికారాల కోసం రాజకీయాలు చేయట్లేదని, తెలంగాణ పునర్నిర్మాణం కోసమే తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరుస్తానని, తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదంటూ ట్వీట్ చేశారు.