మాజీ మంత్రి KTR.. PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసినందుకు నోటీసులు పంపించారు. హామీల అమలు చేతకాక ఫోన్ ట్యాపింగ్ పై రాద్ధాంతం చేస్తున్నారని, దీనిద్వారా స్థానిక ఎన్నికల్లో గెలుపొందాలనే దురుద్దేశముందన్నారు. వెంటనే మహేశ్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు.