అరాచకాలకు అడ్డా(Platform)గా బెంగాల్ ఉందన్న ప్రధానికి.. CM మమత సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎవరేంటో తేలుతుందని, దమ్ముంటే నోటిఫికేషన్ ఇప్పించాలన్నారు. అక్కడి అలీపుర్దార్ టూర్లో మోదీ.. మమత సర్కారును నిలదీశారు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ ముర్షిదాబాద్, మాల్దాలో హింస జరిగినా పట్టించుకోలేదన్నారు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. అన్ని పార్టీల MPలు విదేశాలకు వెళ్తే, తృణమూల్ కాంగ్రెస్(TMC) పట్టించుకోలేదన్నారు. ఈ ఆరోపణలపై మండిపడ్డ మమత… ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఎన్నికల్లోనే తెలుస్తుందంటూ ఎదురుదాడి చేశారు. ఏడాదిలోనే బెంగాల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.