BRS పార్టీ అన్ని నియమాల్ని ఉల్లంఘించిందని, అందుకే జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలుస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నారాయణఖేడ్ ఎన్నికల్లో అప్పటి MLA మృతి చెందినపుడు.. BRS పోటీచేసి భారీగా ఖర్చు చేసి గెలిచిందన్నారు. ఆనాటి PCC అధ్యక్షుడు కోరినా అప్పటి సీఎం KCR పట్టించుకోలేదన్నారు. ఆనవాయితీని గులాబీ పార్టీ ఉల్లంఘించినపుడు తామెందుకు కొనసాగించాలన్నారు. అక్కడి శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ ఈనెల 8న మృతిచెందారు. దీంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఎన్నిక రాబోతున్న దృష్ట్యా.. PCC అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.