BJP MLA రాజాసింగ్ మరోసారి సొంత పార్టీ రాష్ట్ర లీడర్లపై విరుచుకుపడ్డారు. ఆయన మాటల్లోనే…
‘ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు.. BJP ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచించాలి.. ఇతర పార్టీ నేతలతో BJP లీడర్లు ఒక్కటైంది అందరికీ తెలుసు.. ఆఫ్ ద రికార్డ్ లో కవిత మాట్లాడింది నిజమే.. పెద్ద ప్యాకేజ్ దొరికితే మా వాళ్లు BRSతో కలిసిపోతారు.. BJP క్యాండిడేట్లు ఎక్కణ్నుంచి నిలబడాలనేది కూడా వాళ్లే డిసెడ్ చేస్తరు తప్ప మావోళ్లు కాదు.. మా పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాలి.. మరి ఎందుకొస్తలేదు.. ప్రతి BJP కార్యకర్తకీ ఈ విషయం తెలిసినా ఎవరూ బయటపడరు..‘. ఇలా.. గతంలోనూ ఆయన సొంత పార్టీ నేతల తీరును విమర్శించారు.