మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కీలకంగా మారింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC స్థానానికి మొదటి రౌండ్ లో ఎవరికీ పూర్తి మెజార్టీ దక్కలేదు. మొత్తం ఓట్లు 2,52,029 కాగా, అందులో 2,23,343 చెల్లినవి ఉన్నాయి. 28,686 ఓట్లు చెల్లనివి. కోటా నిర్ధారణకు 1,11,672 ఓట్లు అవసరం కాగా.. కమలం పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ముగ్గురు ప్రధాన పోటీదారుల ఓట్లు ఇలా…
అంజిరెడ్డి – 4,935(ఓవరాల్ 75,675)
నరేందర్ రెడ్డి – 4,387(ఓవరాల్ 70,565)
ప్రసన్న హరికృష్ణ – 3,473(ఓవరాల్ 60,419)
మిగతా పోటీదారులు 53 మందికి కలిపి వచ్చిన ఓట్లు 16,784
గెలుపు కోటాకు అవసరమయ్యే రెండో ప్రాధాన్యత ఓట్లు ఇలా…
అంజిరెడ్డి – 35,997
నరేందర్ రెడ్డి – 41,107
ప్రసన్న హరికృష్ణ – 51,253