మోదీ విదేశాంగ విధానం అద్భుతమని, ఆయనకు దేశమంతా అండగా నిలవాలని కాంగ్రెస్ MP శశి థరూర్ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు ఆయన 5 దేశాలు సందర్శించారు. ‘ది హిందూ’ పత్రికకు థరూర్ రాసిన వ్యాసాన్ని PM కార్యాలయం.. ట్వీట్ చేసింది. దీంతో కాంగ్రెస్ విమర్శలు మళ్లీ పెరిగాయి. మోదీ శక్తి, చైతన్యం, ఇతర దేశాలతో సంబంధాల్ని ఆ వ్యాసం(Article)లో కొనియాడారు. కేరళ తిరువనంతపురం నుంచి 4 సార్లు MPగా గెలిచిన థరూర్.. 2016 సర్జికల్ స్ట్రైక్స్ పై మాట్లాడటంతో కాంగ్రెస్ ఇరుకున పడింది. నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రచారం చేయకపోవడంతో కేరళ కాంగ్రెస్ ఆయనపై దుమ్మెత్తిపోసింది.