ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తోనే 2018లో కాంగ్రెస్ ఓడిపోయిందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలిపారు. సిట్(SIT)కు ఆయన.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చారు. తమ పార్టీతోపాటు BJP నేతలు కూడా బాధితులేనని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని వివరించారు. నక్సలైట్ల సానుభూతిపరులుగా చూపిస్తూ ట్యాప్ జరిగిందని, హోదా లేని ప్రభాకర్ రావును IG పోస్టులో కూర్చోబెట్టారన్నారు. అప్పటి CS, DGP, హోం శాఖ కార్యదర్శి కలిసి దీనికి సహకరించారని మహేశ్ గౌడ్ ఆరోపించారు.