భారత్ కు దీటుగా ఇంగ్లండ్ బ్యాటింగ్.. 276కు 5 వికెట్లు పడ్డా.. హ్యారీ బ్రూక్(Harry Brook) దూకుడు ఆగలేదు. ఆట మూడోరోజు భారత బౌలర్లను ఆటాడుకుంటూ వందకు చేరువయ్యాడు. అదే ఊపులో ఒక రన్ చేస్తే సెంచరీ అయిపోయేది. కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని ఆడగా, అది శార్దూల్ చేతుల్లో పడింది. అలా 99 వద్ద ఔటై తీవ్ర నిరాశతో బ్రూక్ వెళ్లిపోయాడు. ఇంగ్లిష్ బ్యాటర్లలో డకెట్(62), పోప్(106), రూట్(28), స్టోక్స్(20), జేమీ స్మిత్(40) పరుగులు చేశారు. ప్రస్తుతానికి ఆ టీమ్ 92 ఓవర్లలో 441/7తో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 471కి ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ చేరువలో ఉంది.