తొలి ఇన్నింగ్స్ లో గిల్, పంత్.. రెండో ఇన్నింగ్స్ లో రాహుల్, పంత్ సెంచరీలు… రోహిత్, కోహ్లి లేకుండా నిలబడగలరా అన్న ప్రశ్నలకు ఒక టెస్టులో 5 సెంచరీలతో గట్టి సమాధానం… ఇదీ ఇంగ్లండ్ తో ఫస్ట్ టెస్టులో టీమ్ఇండియా కుర్రాళ్ల ఆట. మ్యాచ్ ఓడినా.. ఆతిథ్య జట్టును చివరి వరకు అంత ఈజీగా వదలని పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు.. 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. క్రాలీ(69), డకెట్(149), పోప్(8), బ్రూక్(0), స్టోక్స్(33) ఔటైనా.. జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో, జేమీ స్మిత్(44 నాటౌట్) చివరిదాకా పోరాడి గెలిపించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 471, ఇంగ్లండ్ 465 చేశాయి. సెకండ్ ఇన్నింగ్ లో టీమ్ఇండియా 364 స్కోరు చేయగా, 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ప్రత్యర్థికి 371 టార్గెట్ విధించింది. https://justpostnews.com