ఇంగ్లండ్(England)తో ఈనెల 20 నుంచి మొదలయ్యే తొలి టెస్టులో వైస్ కెప్టెన్ పంత్ ఆడటం ఖాయమైంది. కెప్టెన్ గిల్ నాలుగు, పంత్ 5వ స్థానంలో ఆడతారు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ తర్వాత ఈ స్థానాల భర్తీపై BCCI దృష్టిపెట్టింది. టెస్ట్ క్రికెట్ కెరీర్ ను ఓపెనర్ గా ప్రారంభించిన గిల్.. జైస్వాల్ కోసం ఆ స్థానాన్ని వదులుకున్నాడు. ఇక మూడో స్థానంలో ఎవరొస్తారనేది సస్పెన్స్ గా ఉంది. 2007 తర్వాత ఇప్పటివరకు ఇంగ్లిష్ గడ్డపై సిరీస్ నెగ్గని టీమ్ఇండియా.. ఇప్పుడా రికార్డును బ్రేక్ చేయాలని చూస్తోంది.