బంగ్లాదేశ్ బౌలర్లు భారత్ టాప్, మిడిలార్డర్ ను దెబ్బతీశారు. యశస్వి, పంత్ కాసేపు పోరాడినా లాభం లేకపోగా.. చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. జైస్వాల్ హాఫ్ సెంచరీ(56)తో నిలబడ్డా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆడకుండానే ఔటయ్యారు. అతడి తర్వాత రాహుల్(16) కూడా వెనుదిరగడంతో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమ్ఇండియా.
అంతకుముందు రోహిత్(6), గిల్(0), కోహ్లి(6) వెంటవెంటనే ఔటైనా పంత్(39), జైస్వాల్ జోడీ నాలుగో వికెట్ కు 62 రన్స్ పార్ట్నర్ షిప్ ఇచ్చింది. పేస్ బౌలర్ హసన్ మహమూద్ 4 వికెట్లు తీయగా, నహీద్ రాణా, మెహిదీ హసన్ మిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.