92కే మూడు వికెట్లు పడ్డ జట్టును ముందుండి నడిపిస్తున్నారు రాహుల్, పంత్ జోడీ. ఇంగ్లండ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 202 బంతుల్లో 13 ఫోర్లతో 100 పూర్తి చేశాడు. ఈ ఇద్దరి జోడీ క్రీజులో కుదురుకోవడంతో పరుగులకు ఇబ్బంది లేకుండా పోయింది. అంతకుముందు సుదర్శన్(30), గిల్(8) తొందరగా ఔటయ్యారు. దీంతో భారం రాహుల్-పంత్ పై పడింది.