ఇంగ్లండ్ బౌలర్లపై తొలిరోజు ఆధిపత్యం(Domination) ప్రదర్శించిన టీమ్ఇండియా కుర్రాళ్లు.. రెండోరోజు అదే ఆటను కంటిన్యూ చేస్తున్నారు. తొలి టెస్టులో 359/3తో రెండోరోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్(144 బ్యాటింగ్), పంత్(111 బ్యాటింగ్) జోడీ… ప్రత్యర్థి బౌలర్లను అలసటను తెప్పించింది. తొలుత కెప్టెన్ జోరు చూపిస్తే, తర్వాత వైస్ కెప్టెన్ రేసులోకొచ్చాడు. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే స్కోరు 400 దాటి భారత్ పటిష్ఠ స్థితికి చేరింది. 99 వద్ద సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ తర్వాత మరో సిక్సర్ కొట్టాడు.