ఇంగ్లండ్ పై సెంచరీతో సత్తా చాటిన వికెట్ కీపర్ రిషభ్ పంత్.. సరికొత్త రికార్డులు సాధించాడు. టెస్టుల్లో 7 సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటిదాకా ధోని 6 సెంచరీలే రికార్డు. 7 సెంచరీలు చేసిన ఆసియన్ గా సంగక్కరతో సమంగా ఉన్నాడు. ఈ ఏడింట్లో 3 ఇంగ్లండ్ లో, రెండేసి చొప్పున దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేశాడు. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపైనే 5 సెంచరీలు బాదిన ఆసియన్ గా ఘనత పొందాడు. కెరీర్లో 3 వేల పరుగులు దాటి ధోని వెనుకనే ఉన్నాడు. ‘పంత్ 90కి చేరగానే టెన్షన్ పడ్డా.. ఔటైపోతాడేమోనని.. గతంలో అలాగే జరిగింది.. కానీ వంద చేసి ఊపిరి పీల్చుకున్నాడు.. అతడే భారత గొప్ప వికెట్ కీపర్..’ అని మంజ్రేకర్ ప్రశంసించాడు.