430/4తో పటిష్ఠంగా సాగుతున్న బ్యాటింగ్ ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దెబ్బతీశాడు. 430/4 నుంచి ఒక్కసారిగా 454/7కు చేరుకుంది భారత్. ఇందులో నాలుగు వికెట్లను స్టోక్స్ దక్కించుకున్నాడు. రెండోరోజు ఆటలో పంత్(134) సెంచరీయే హైలెట్. అంతకుముందు గిల్(147) ఔట్ కాగా, సుదర్శన్ మాదిరిగానే కరుణ్ నాయర్(0) సైతం డకౌటయ్యాడు. ఒలీ పోప్ అద్భుత డైవ్ తో కరుణ్ వెనుదిరిగాడు. తర్వాత కొద్దిసేపటికే పంత్ నిష్క్రమించాడు. లంచ్ టైంకు భారత్ 454/7తో ఉంది.