తొలి ఇన్నింగ్స్ లో 134.. రెండో ఇన్నింగ్స్ లో 118… ఇదీ రిషభ్ పంత్ ఘనత. ఒకవైపు సహనం, మరోవైపు చెత్త బంతుల్ని ఉతికి ఆరేయడం.. ఇలా సాగింది బ్యాటింగ్. ఇంగ్లండ్(England)తో తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగి అదరగొట్టాడు. సెంచరీ పూర్తయ్యాక రూట్ వేసిన ఓవర్లో పరుగులు పిండుకున్నాడు. వరుస బంతుల్లో 4b, 4, 6, 4, 1, 0 రన్స్ వచ్చాయి. కానీ అదే ఊపులో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతానికి 292/4తో ఉన్న టీమ్ఇండియా.. మొత్తంగా 298 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలా వరుసగా రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసిన రెండో కీపర్ పంత్. అంతకుముందు ఆండీ ఫ్లవర్(జింబాబ్వే) ఈ ఘనత సాధించాడు.