IPLలో విధ్వంసక బ్యాటింగ్ తో ఆకట్టుకున్న 14 ఏళ్ల చిన్నోడు వైభవ్(Vaibhav) సూర్యవంశీ.. మరోసారి అదే ఆటను చూపించాడు. ఇంగ్లండ్ లో జరుగుతున్న అండర్-19 యూత్ తొలి వన్డే(Youth ODI)లో ఇంగ్లిష్ జట్టుపై దుమ్ముదులిపాడు. 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 19 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. తొలుత ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత వైభవ్, అభిజ్ఞాన్ కుందు(45) దూకుడుతో 24 ఓవర్లలోనే 178/4 చేసిన భారత్.. 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. https://justpostnews.com