వివిధ జిల్లాల్లోని RTA కార్యాలయాలపై అవినీతి నిరోధకశాఖ(ACB) అధికారులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్, తిరుమలగిరి, పెద్దపల్లి, మన్నెగూడ ఆఫీసులపై దాడులకు దిగారు. అధికారులు-ఏజంట్ల మధ్య పెద్దయెత్తున అవినీతి జరుగుతుందంటూ ACBకి ఫిర్యాదులందాయి. ఉప్పల్, తిరుమలగిరి, పెద్దపల్లిలో పెద్దసంఖ్యలో ఏజంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరుమలగిరి, మన్నెగూడల్లోనూ పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అధికారుల బృందాలు వివరాలు రాబడుతున్నాయి. తలుపులు మూసేసి మరీ సోదాలు జరుగుతుండగా, ఇవి రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా RTA కార్యాలయాల్లో ఏజంట్లదే మొత్తం వ్యవహారమన్నట్లు నడుస్తుంటుంది. అక్రమాలకు అడ్డాగా మారిన RTA ఆఫీసులపై ఏకకాల దాడులతో.. ఆ శాఖలో కలకలం రేగుతోంది.