కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అఖిలపక్ష MPలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ముందు ఉంచింది. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను వివరిస్తూ దాని నిర్మాణంపై CM బృందం అభ్యంతరం తెలిపింది.