రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశం ఆశ్చర్యపోయేలా ‘పే స్కేలు’ అందిస్తామని కేసీఆర్ అన్నారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతామన్నారు. అతి త్వరలోనే ఎంప్లాయిస్ కి ఐఆర్ అందిస్తామని శాసనసభలో ప్రకటించారు. ‘ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే.. వాళ్లను బాగా చూసుకుంటాం’ అని CM అన్నారు.