ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున తగిన సౌకర్యాలు(Fecilities) కల్పించాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ ఏడాది ప్రైవేటు నుంచి 48 వేల మంది సర్కారీ బడుల్లో చేరినట్లు విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు తెలిపారు. పెరిగిన సంఖ్యను బట్టి అదనపు తరగతి గదులు నిర్మించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వారంలో కనీసం రెండుసార్లు బడుల్ని సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్, కట్టెల పొయ్యిలు కాకుండా సోలార్ కిచెన్ల ఏర్పాట్లపై వెంటనే దృష్టిపెట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. పదోతరగతి పాసవుతున్న విద్యార్థులకు ఇంటర్ లో చేరేవారి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంపై ఉన్నతాధికారులు యోగిత రాణా, శ్రీదేవసేన, ఎం.హరితను అడిగి తెలుసుకున్నారు.