మాజీ CM కేసీఆర్ పై విచారణ ముగిసింది. ఆయన్ను 50 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటికే 114 మందిని విచారించిన జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్.. 115వ వ్యక్తిగా KCRను ప్రశ్నలు అడిగింది. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టును మార్చడం, ఆనాటి నిర్ణయంలో KCR, హరీశ్, ఇంజినీర్ల పాత్ర ఏంటనే దానిపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. జలుబు(Cold)తో అనారోగ్యంగా ఉన్నందున విచారణ చేపట్టే సమయంలో ఎవరూ ఉండొద్దని ఆయన కోరారు. ఈ వినతికి కమిషన్ అంగీకారం తెలపగా.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నివేదికను అందజేసి KCR వెళ్లిపోయారు. నీటి లభ్యత ఆధారంగానే కాళేశ్వరం కట్టామన్నారు.