అక్రమ(Illegal) నిర్మాణాల విషయంలో హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు మండిపడింది. డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహించింది. ‘భవన నిర్మాణం పూర్తయ్యేవరకు ఏం చేస్తున్నారు.. కళ్లు మూసుకుని తిరుగుతుంటారా.. మేం ఆదేశాలు ఇస్తేనే ఆర్డర్స్ ఇస్తారా.. ఈలోపే అక్కడ బిల్డింగ్ పూర్తవుతుంది.. ఇక కూల్చివేత పేరుతో డ్రామా మొదలుపెడతారు.. స్థానిక సిబ్బంది ఉన్నా నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయ్.. పన్నుల వసూలప్పుడు బిల్డింగ్ లు కనపడ్తయ్.. కానీ అక్రమ నిర్మాణాలు మాత్రం కనపడవ్..’ అంటూ శేరిలింగంపల్లి వాసి వేసిన పిటిషన్ పై యంత్రాంగం మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.