పురపాలక ఎన్నికలు(Municipal Elections) ఎందుకు నిర్వహించట్లేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు కారణమేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 11కు వాయిదా వేసింది. గడువు ముగిసినా ఎలక్షన్లు నిర్వహించట్లేదంటూ నిర్మల్ వాసి ఎస్.రాజేందర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మార్చి 25వ తేదీనే గడువు ముగిసినా పట్టింపులేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో సరైన సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మూడు నెలల్లోపు పెట్టాల్సిందేనంటూ రెండ్రోజుల క్రితమే(జూన్ 25న) హైకోర్టు ఆదేశించింది. https://justpostnews.com