16 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు విస్తరించినా వర్షాలకు అంతరాయమేర్పడింది. పొడిబారిన వాతావరణమే నాలుగైదు రోజులుగా ఉంది. ఇదే తీరు ఇంకో 4 రోజులు కొనసాగనుండగా, కేవలం తేలికపాటి వానలుంటాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. అల్పపీడనం వల్ల గాలిలోని తేమ శాతం ఈశాన్య రాష్ట్రాల వైపు కదలడంతో ఆ ప్రాంతాల్లో వర్షాలు, వరదలు ఉన్నాయి. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై పడి పొడిబారిన వాతావరణం ఏర్పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు 37 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ముందస్తు రుతుపవనాలతో ఇప్పటికే రైతులు పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వానలు లేక ఉక్కబోత వాతావరణమే కనిపిస్తోంది.