
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) శుక్రవారం(ఈనెల 15న) నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పొద్దున జరిగే పేపర్-1కు 2,69,557 మంది, మధ్యాహ్నం నిర్వహించే పేపర్-2కు 2,08,498 మంది అప్లయ్ చేసుకున్నారు. పేపర్-1కు 1,139, పేపర్-2కు 913 ఎగ్జామ్స్ సెంటర్స్ అందుబాటులో ఉంచారు. టెట్ లో వచ్చిన మార్కులకు టీచర్ రిక్రూట్మెంట్(Teacher Recruitment)లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున మార్కులు కీలకం కాబట్టి కొత్తగా రాసేవారితోపాటు ఇంతకుముందు క్వాలిఫై అయి మళ్లీ మార్కులు పెంచుకునేందుకు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఒకరోజు ముందుగానే తమకు కేటాయించిన సెంటర్లను పరిశీలించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
టెట్ నిర్వహించే ఎగ్జామ్స్ సెంటర్లకు ఈరోజు మధ్యాహ్నం ఒకపూట, రేపు పూర్తిగా సెలవు ప్రకటించాలని విద్యాశాఖ ఆదేశించింది. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులతోపాటు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. హాల్ టికెట్ పై వివరాలు(Details) తప్పుగా ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో ఇచ్చే నామినల్ రోల్స్ లో సరిచేసుకోవాల్సి(Correct) ఉంటుంది.