తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు వేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. కేవలం 3 రోజుల్లోనే రూ.5,215 కోట్లు అందించామన్నారు. నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ఈరోజు మొత్తంగా 1,313.53 కోట్లు వేయగా, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ వారంలో జమవుతాయని తెలిపారు. ఈనెల 16న రైతు భరోసా మొదలు కాగా.. ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల కోట్ల రూపాయల్ని రైతులకు అందిస్తున్నామన్నారు.